SRD: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై ఫోన్ టాపింగ్ ద్వారా నిఘా పెట్టినా ఏం సాధించలేకపోయారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా నిధులు విడుదల చేసిందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఖజానాను ఖాళీ చేసిందని విమర్శించారు.