మన్యం: జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్, బదిలీలు పారదర్శకంగా జరగాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ అంశంపై జిల్లా రెవెన్యూ అధికారి కే.హేమలతకు ఓబీసీ జిల్లా ఛైర్మన్ వంగల దాలి నాయుడు నాయకులతో కలసి వినతిపత్రం అందజేశారు. నాయకుల సిఫార్సుల ఆధారంగా బదిలీలు జరుగుతున్నాయని ప్రచారం నడుస్తుందన్నారు.