CTR: చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలో శ్రీ స్వయంభు వైష్ణవి దేవి మాత ఆలయంలో గురువారం వారాహి దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకురాలు శ్రావణి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పాలభిషేకము అలంకరణ గావించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఆలయ నిర్మాణ కర్త వినోద్ కుమార్ రెడ్డి పవిత్ర తీర్థ ప్రసాదాలు అందించారు.