SKLM: అందరూ కలిసికట్టుగా డ్రగ్స్ను తరిమికొట్టి యువతను కాపాడుకుందామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి తిరుపతినాయుడు అన్నారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై గురువారం ఆర్ట్స్ కాలేజ్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో డ్రగ్స్పై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డ్రగ్స్ను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.