NGKL: అమ్మాపూర్ సమీపంలోని ప్రసిద్ధ కురుమూర్తి స్వామి క్షేత్రంలో ఇవాళ ఉదయం 10:30 గంటలకు గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి వేడుకను విజయవంతం చేయాలని కోరారు. ‘పేదల తిరుపతి’గా వెలుగొందుతున్న స్వామివారి గిరి ప్రదక్షిణ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.