HYD: త్వరలో చర్లపల్లి పరిధిలో వరదనీటి సమస్యకు పరిష్కారం లభించనుంది. డి-మార్ట్ మీదుగా పోచమ్మ కుంట వరకు అక్కడి నుంచి కుషాయిగూడ కృష్ణారెడ్డి నగర్ కమాన్ వరకు రూ.3.75 కోట్లతో వరద నీటి కాలువ నిర్మాణం జరగనుంది. దీనిపై జీహెచ్ఎంసీ యంత్రాంగం నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ నిర్మాణం కనుక పూర్తయితే వరదనీటి సమస్యలు తీరనున్నాయి.