KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 21,988 క్యూసెక్కుల నీటిని మంజీరాకు శుక్రవారం ఉదయం 6.30 గంటలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈఈ అక్షయ్ తెలిపారు. ప్రాజెక్టులోకి 20,645 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు చెప్పారు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 17.773 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.