SRD: రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీలోని శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి 4వ వార్షికోత్సవం, పోచమ్మ తల్లి జాతర మహోత్సవానికి భారీగా భక్తజనం తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి ఆలయానికి భారీగా భక్తజనం తరలి రావడంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.