SRCL: దళిత హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేడ్కర్ అని కమాండెంట్ సురేష్ అన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధి సర్దాపూర్లోని బెటాలియన్లో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళితుల హక్కుల కోసం పోరాటమే కాకుండా దేశ మొదటి న్యాయమంత్రిగా పనిచేసి ఎన్నో సేవలను అందించాలని కొనియాడారు.