NGKL: క్రైస్తవ సోదర సోదరీమణులకు మంత్రి జూపల్లి ఇవాళ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన కోరారు.