ADB: ఈనెల 23, 24 తేదీలలో జరిగే ప్రాథమిక పాఠశాల కాంప్లెక్స్ సమావేశాలను వాయిదా వేయాలని తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సునీల్ చౌహన్, వలబోజు గోపికృష్ణ కోరారు. ఈ విషయమై కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. 23వ తారీకు వసంత పంచమి, 25న ఆదివారం కావున పాఠశాలలో ఆటల పోటీలు, జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం లేదని విన్నవించారు.