MDK: నార్సింగి మండలంలోని సంకాపూర్ గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. మహిళా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగా సంకాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మదర్ పౌల్ట్రీ యూనిట్లో సుమారు 2,300 కోళ్ల పెంపకం చేపట్టడం జరుగుతుందన్నారు. 45 రోజుల తర్వాత ఎంపిక చేయబడిన మహిళా సంఘాల్లోని మహిళలకు కోళ్లను అందిస్తామన్నారు.