MHBD: రోడ్డు భద్రత నియమాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నెల్లికుదురు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు భద్రత నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం కుటుంబాలను విచ్చిన్నం చేసే ప్రమాదకర అలవాటని అన్నారు.