NZB: ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ పేర్కొన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన 44 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.