KNR: చొప్పదండికి చెందిన గుజ్జేటి అశ్విత జాతీయ స్థాయి ఫుట్ బాల్ క్రీడా పోటీలకు ఎంపికైంది. దీంతో ఈనెల 21న మణిపుర్లోని ఇంఫాల్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా జాతీయ స్థాయి ఎంపికైన క్రీడాకారిణిని బీజేపీ పట్టణ అధ్యక్షుడు చిల్ల శ్రవణ్ కుమార్ అభినందించారు. అశ్వితకు ప్రయాణ ఖర్చులకు రూ. 10 వేలు ఆర్థిక సాయం అందించి సన్మానించారు.