MNCL: జన్నారం మండలంలోని దేవునిగూడెంలో మిలిటరీ ఇంజనీరింగ్ ట్రైనీ అధికారుల పర్యటన కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం వారు ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, సిఎస్సీ మీసేవ కేంద్రాన్ని సందర్శించారు. మొదట పాఠశాలలో విద్యార్థులను కలుసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అలాగే మీ సేవ కేంద్రాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.