మహబూబ్నగర్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ కళ్యాణ మండపంలో తెలంగాణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.. మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ జ్ఞానేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.