KDP: చక్రాయపేట మండలం బాలతిమ్మయ్య గారి పల్లెలో విషాదం నెలకొంది. కవల పిల్లలైన రామ్, లక్ష్మణ్ నీటి సంపులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వీరు ఖాజీపేట మండలం నాగసానీ పల్లెకు చెందినవారు. చిన్నప్పుడే వీరి తండ్రి చనిపోవడం, తల్లి మరొకరితో వెళ్లిపోవడంతో మేనమామ దగ్గర పెరుగుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.