NLR: రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల బదిలీల ప్రక్రియను కూటమి సర్కార్ ప్రహాసనంగా మార్చేసిందని వైసీపీ MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. రెడ్ బుక్ విద్యాశాఖ మంత్రికి విద్యావ్యవస్థపై కనీస అవగాహన, శ్రద్ధ లేకుండా పోయిందని అన్నారు. జిల్లాలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మ్యానువల్ విధానంలోనే బదిలీ ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేశారు.