SRCL: ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామంలోని ఫెర్జిలైజర్, ఫెస్టిసైడ్, సీడ్స్ దుకాణ నిర్వాహకుడు నాసిరకం ఎరువులను విక్రయించారని, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్కరికి రూ. 800 చొప్పున ఇస్తామని దుకాణదారుడు చెప్పడంతో రైతులు శాంతించారు. మండల వ్యవసాయాధికారిణి అనూష చేరుకుని దుకాణాన్ని, రికార్డులను తనిఖీ చేశారు.