KNR: బెజ్జంకి మండలం దాచారం గ్రామంలో ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, ప్రభుత్వ పాఠశాలలో కిచెన్ షెడ్డు నిర్మాణ పనులను మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం బెజ్జంకి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో జరిగిన మండల స్థాయి సీఎం కప్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మెమొంటోలు అందజేశారు.