BDK: నిజామాబాద్లో ఈ నెల 21, 22 తేదీలలో జరిగే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు ఆర్.మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మణుగూరులోని సింగరేణి పని ప్రదేశాల్లో ఈ మహాసభల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మిక సమస్యలపై నిర్వహించే ఈ సభలో కార్మికులు పాల్గొనాలని కోరారు.