NRPT: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ధన్వాడలో జ్యోతి రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. హిందూ, ముస్లింలు భాయి-భాయిగా మెలుగుతూ మతసామరస్యాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. చిట్టెం మాధవరెడ్డి, ఇక్బాల్ ఖాన్, ఉపసర్పంచ్ నర్సింలు, ఇతర అఖిలపక్ష నాయకులు పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.