WGL: నర్సంపేట మున్సిపాలిటీలోని 24వ వార్డులో గురువారం మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రీలక్ష్మీ-రామానంద్, కమిషనర్ కాటం భాస్కర్, స్థానిక కౌన్సిలర్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ.. రానున్న వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా చేస్తామని, అవసరమైన చోట నూతన బోర్లు వేసి మోటర్లు అమర్చి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.