జగిత్యాలలో రూ. 23.5 కోట్లతో ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభంతో అత్యవసర వైద్య సేవలు విస్తరించనున్నాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణమే ప్రాణ రక్షణ చికిత్స అందేలా ఈ యూనిట్ కీలకంగా మారుతుందని చెప్పారు. డయాలసిస్ సేవలు, అత్యవసర ప్రసూతి శస్త్రచికిత్సలు, మూడు ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయన్నారు.