NGKL: బిజినపల్లి మండలం నంది వడ్డెమాన్లోని శ్రీ సార్థసప్త జేష్టమాత సమేత శనేశ్వర దేవాలయంలో ఈరోజు మధ్యాహ్నం సామూహిక శనేశ్వర వ్రతాలు జరగనున్నాయి. శ్రీ విశ్వవాసు సంవత్సరం కార్తీక మాసం చివరి శనివారం సందర్భంగా ఈ వ్రతాలు నిర్వహించనున్నారు. మేషం నుంచి మీనం వరకు గల రాశుల వారికి శని గ్రహ బాధల నివారణ కోసం వీటిని ఏర్పాటు చేశారు.