BDK: కొత్తగూడెం ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం ఘోరం జరిగింది. అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందిందని ఆసుపత్రి ముందు బంధువులు బైఠాయించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐ శివ ప్రసాద్, ఎస్ఐ విజయ కుమారి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.