KMM: కూసుమంచి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఆలయ కమిటీ సభ్యులకు మంత్రి ఈ మొత్తాన్ని అందజేశారు. రామాలయ నిర్మాణానికి విరాళం అందించిన మంత్రికి నేతలు, కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.