AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఆరో రోజు దుర్గమ్మ లలిత త్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులకు ఉదయం 4 నుంచి రాత్రి 12:30 గంటల వరకు దర్శనం కల్పిస్తున్నారు. కుంకుమార్చనకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భవానీ మాలధారణ భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు.