MBNR: చిన్నారులు అన్ని రంగాల్లో ప్రతిభను కనబర్చాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో ‘3వ పిల్లల మర్రి బాలోత్సవ కార్యక్రమం’ ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, చిత్ర లేఖనం, ఆటలు, దేశభక్తి గీతాలు తదితర ప్రదర్శనలను సందర్శించారు.