JGL: ధర్మపురి మండలం తిమ్మాపూర్, బూరుగుపల్లి గ్రామాల పరిధిలో గత వారం రోజులుగా నిర్వహించిన క్రికెట్ టోర్నీ ముగింపు కార్యక్రమంలో ధర్మపురి సబ్ ఇన్స్పెక్టర్ జీ. మహేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా యువత క్రీడల్లో ప్రతిభ చూపి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆయన సూచించారు.