SRPT: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతుంది. మంగళవారం రాత్రి వరకు ప్రాజెక్టుకు 8,598 క్యూసెక్కుల వరద వస్తుండగా ప్రాజెక్టు అధికారులు 4 గేట్లను ఎత్తి 8,579 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 644 అడుగుల వద్ద నీటిమట్టం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.