HYD: నల్లకుంటలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్ అనే వ్యక్తి తన భార్య త్రివేణిపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కుమారుడిని ఇంటి బయట నిలబెట్టి, నిద్రిస్తున్న భార్యపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మంటల్లో త్రివేణి సజీవ దహనం కాగా, కుమార్తె ప్రాణాలతో బయటపడింది. నిందితుడు ఘటన అనంతరం పరారయ్యాడు.