BDK: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇల్లెందు, కోయగూడెం, మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లోని సింగరేణి గనుల్లోకి నీరు చేరడంతో 40,000 టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ముఖ్యంగా మణుగూరు ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు ఉత్పత్తి, మట్టి తీసే పనులు నిలిచిపోయాయి.