KMR: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ వెల్లుట్ల, అన్నసాగర్ గ్రామాలలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం ప్రారంభించారు. గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి ఆరోగ్య కేంద్రాలు ముఖ్య భూమిక పోషిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఏఎన్ఎంలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.