NZB: ప్రజాపాలన దినోత్సవం వేడుకల సందర్భంగా నిజామాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. సిద్ధార్థ కళాక్షేత్ర, నవీపేట, కంజర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల బాలికలు, బోర్గాం (పి) ఉన్నత పాఠశాల, డిచ్పల్లి మానవతా సదన్ చిన్నారులు చూడ చక్కని నృత్యాలు ప్రదర్శించారు.