MDK: రామాయంపేట మండల కేంద్రంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్ లారీలను మంగళవారం రాత్రి ఎస్ఐ బాలరాజు సీట్ చేశారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా మెదక్ ప్రాంతం నుండి ఇసుక తరలిస్తున్న టిప్పర్ లారీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా ఎవరైనా ఇసుక తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.