MDK: నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో వ్యవసాయ అధికారులు రైతులకు యాసంగి పంటలపై తగు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. వరి కోత కోసే సమయంలో హార్వెస్టర్ ఫ్యాన్ యొక్క వేగం 18 – 20 ఆర్పీయం ఉంచడం ద్వారా గింజలు రాలడం తగ్గించవచ్చన్నారు. దాన్ని ముందుగానే ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలన్నారు. తేమ 17% ఉండేటట్లు చూడాలన్నారు.