KMR: బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని జిల్లా బీసీ సంఘం ప్రతినిధులు శివరాములు నాగరాజు పిలుపునిచ్చారు. మంగళవారం కామారెడ్డిలోని మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి బీసీ సంఘం నాయకులు పూలమాలలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను ఎవరు అడ్డుకున్నా తగిన బుద్ధి చెబుతామన్నారు.