నిజామాబాద్: వేల్పూర్ మండల కేంద్రంలో కుక్కల బెడద ఎక్కువైందని స్థానికులు వాపోతున్నారు. మండలానికి చెందిన వెంకట్ గౌడ్ ఎడమచేతిపై రెండు పిచ్చి కుక్కలు దాడి చేసి కిరాతకంగా కరిశాయి. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, గ్రామపంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.