MHBD: మరిపెడ మండలంలో శుక్రవారం సీపీఐ మండల కార్యదర్శి బాలకృష్ణ ఎస్సై కోటేశ్వరరావుకు మత్తు పదార్థాల నిర్మూలణకు వినతిపత్రం అందజేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. యువత భవిష్యత్తు మత్తు పదార్థాల వల్ల నాశనమవుతుందని, అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పీడీ యాక్ట్ నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, తదితరులు ఉన్నారు.