KRNL: కొన్ని నెలల క్రితం ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు చేసుకుని ఇంటర్వ్యూలు పూర్తి చేసి జిరాక్స్ పత్రాలు సమర్పించినప్పటికీ, ఇప్పటికీ వారి ఖాతాల్లో సబ్సిడీ రుణాలు జమ కాలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరుతున్నారు.