AKP: అచ్యుతాపురం జడ్పీ హైస్కూల్లో రూ.18.50 లక్షలతో కొత్తగా నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్ను ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతి సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.