CTR: శక్తి క్షేత్రంగా విరాజల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ దసరా మహోత్సవాలు ఈనెల 23న ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా పుంగనూరుకు విచ్చేసిన స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వాములవారిని ఆలయ ఈవో ఏకాంబరం శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అమ్మవారి కుంకుమ ప్రసాదాలను అందజేసి దసరా మహోత్సవాలకు ఆహ్వానం పలికారు.