KMR: పల్వంచ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మార్వో హిమబిందు ఆదివారం తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మార్వో సూచించారు.