కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని వెంకటేశ్వర ఆలయానికి మంగళవారం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ. 2.54 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో చక్రధరరావు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.