NLG: చండూరు నుంచి దిల్సుఖ్నగర్కు సోమవారం ఉదయం 4:45 గంటలకు బయలుదేరిన పల్లె వెలుగు బస్సులో ఎక్స్ప్రెస్ ఛార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా రూ.110 ఉండే ఛార్జీని బస్సులో రూ.130 వసూలు చేశారని వాపోయారు. పల్లె వెలుగు బస్సు అయినా టికెట్ మీద ఎక్స్ప్రెస్ అని ఉందన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.