WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలో బైక్ అదుపు తప్పి బోల్తా పడడంతో దంపతులకు గాయాలను సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. రహీం రజియా దంపతులు తమ కుమారుడు కలిసి బైక్ పై వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపు వెళ్తున్న క్రమంలో జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలను తప్పించబోయి బైక్ బోల్తా పడింది. దీంతో దంపతులకు గాయాలు కావడంతో వారిని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు.