CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని రష్యన్ భక్తులు పదిమంది దర్శించుకున్నారు. ఆలయ ఏఈవో రవీంద్రబాబు వారికి ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని బహుకరించారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.