MBNR: మిడ్జిల్ మండలం కొత్తూర్ గ్రామంలో ఆదివారం వికసిత్ భారత్ రచ్చ బండ కార్యక్రమం బీజేపీ మండల అధ్యక్షుడు నరేష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి హాజరయ్యారు. ప్రధాని మోదీ 11ఏళ్ల సుపరిపాలన సందర్భంగా చేపడుతున్న పథకాల అభివృద్ధి గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు శివాజీ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు